Thursday, April 25, 2024

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న జడ్పీటీసీ..

సుల్తానాబాద్‌: సుల్తానాబాద్‌ జెడ్పిటిసి మినుపాల స్వరూప ప్రకాష్‌రావు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ఆమె భర్త, సుద్దాల మాజీ సర్పంచ్‌ ప్రకాశరావు, కుటుంబ సభ్యులు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరూ వ్యాక్సిన్‌ తీసుకొని కరోనా బారి నుండి సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement