Friday, April 19, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌..

ఓదెల: కోవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం నుండి టీకాల వేయడం ప్రారంభించారు. మండలంలోని ఓదెల, కొలనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ను వేస్తున్నారు. మే 1 నుండి 18 ఏళ్లు నిండిన వారందరికీ సైతం ఉచితంగా టీకాలను వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో 45 ఏళ్ల వారు ఎక్కువ మొత్తంలో ఆసుపత్రికి వచ్చి టీకాల కోసం క్యూలో నిలుచున్నారు. ఆయా గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన వారి వివరాలను ఆరోగ్య బృందాలు గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువ మొత్తంలో నమోదవుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొని వ్యాక్సిన్‌ కోసం పోటీ పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement