Saturday, April 20, 2024

ఇంటింటికి కరోనా పరీక్షలు

పెద్దపల్లి: గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుతున్న దృష్ట్యా వైద్య సిబ్బంది ఇంటింటికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం పట్టణంలోని ముత్యాల పోచమ్మ వాడలో ఇంటింటా వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు రేణుక, శైలజలు కలిసి 25 మందికి కరోనా -టె-స్టులు చేయగా అందరికి నెగటివ్‌ వచ్చినట్లు తెలిపారు. అలాగే ప్రజలకు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో బయటకు తిరగాలని కోరారు. ఇంటి వద్దనే టెస్టులు చేయడం పట్ల కాలనీకి చెందిన మంథని లక్ష్మి నర్సయ్య, దామోదర్‌, అన్నపూర్ణమ్మ, మంథని నర్సింగ్‌లు ప్రత్యెక కృతఙ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement