Monday, March 25, 2024

ఎండ తీవ్ర‌త అస్వ‌స్థ‌త‌కి గురైన కానిస్టేబుల్.. చికిత్స పొందుతూ మృతి

ప‌లు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ‌ల ధాటికి త‌ట్టుకోలేక ఓ కానిస్టేబుల్ మ‌ర‌ణించాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. వడదెబ్బ తగిలి పోలీస్ కానిస్టేబుల్ సంతోష్ కుమార్ మరణించారు. నిన్న మధ్యాహ్నం ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ రాత్రి 11 గంటలకు మరణించారు. 2000వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఈయన రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. మొన్నటి వరకు వర్షాలు పడినప్పటికీ… ఇప్పుడు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు విలవిలలాడుతున్నారు. బయట అడుగుపెట్టాలంటేనే.. వనికి పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement