Thursday, April 18, 2024

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ..

ముత్తారం: మండలంలోని అడవిశ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన లక్కాకుల రజితకు మంజూరైన రూ. 18వేల సీఎం స హాయనిధి చెక్కును కాంగ్రెస్‌ నాయకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ లబ్ధిదారునికి చెక్కును అందించారు. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు చెక్కు అందించినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసి గీతా రాణి, వార్డుసభ్యులు ఆకొజ్‌ అశోక్‌ , కొట్ట ఉపేందర్‌, మాజీ వార్డు సభ్యులు గట్టు- సదయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు లక్కం ప్రభాకర్‌, తోడేటి శశికుమార్‌, సలుపాల మిల్లు ఓదెలు, అంబటి రాజయ్య, సలుపాల రవి, ఎడ్ల వెంకటేష్‌, యూత్‌ నాయకులు మోత్కూరి మహేష్‌, అంబటి కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement