Friday, March 29, 2024

గంగుల మల్లయ్యకు సీఎం కేసీఆర్ ఘ‌న నివాళి

హైద‌రాబాద్ నుండి హెలికాప్టర్ లో కరీంనగర్ పిటిసికి చేరుకున్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు రోడ్డు మార్గం ద్వారా కొండ సత్యలక్ష్మి గార్డెన్ కు చేరుకున్నారు. ఇటీవల స్వర్గస్తులైన గంగుల మల్లయ్య పెద్ద కర్మకు హాజరై ఆయ‌న చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి ఘ‌న నివాళులర్పించారు. మల్లయ్య కుమారులైన మంత్రి గంగుల కమలాకర్, ఆయన సోదరులు గంగుల వెంకన్న,సుధాకర్ లతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు సుంకే రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement