Friday, April 19, 2024

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌: పెద్దపల్లి ఎమ్మెల్యే

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. సోమవారం సుల్తానాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పిందని, రైతులు నష్టపోకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్‌ ముందుకు వచ్చి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంతో మరోసారి సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా రుజువు చేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మెన్‌ బుర్ర శ్రీనివాస్‌, కేడీసీసీబీ డైరెక్టర్‌ శ్రీగిరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement