Tuesday, April 23, 2024

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం.. లేగదూడ‌పై దాడి..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ల‌పల్లి మండలం గోపాల్ రావు పల్లెలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మండ‌లంలోని మునిగే ఎల్లయ్య తన లేగదూడపై చిరుత దాడిచేసింది. వెంట‌నే అత‌డు అట‌వీ శాఖ‌ అధికారులకు సమాచారం అందజేశాడు. దీంతో అటవి, పశు సంవర్ధక శాఖ అధికారులు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించగా చిరుత పాద ముద్రలు గుర్తించారు. ఘటనతో గ్రామస్థులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులు ఎవరూ కూడా సమీప అటవి ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. చిరుతను పట్టుకోవడానికి శాఖ పరమైన ఏర్పాట్లు చేస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement