Wednesday, April 24, 2024

షర్మిలమ్మ పద్ధతి మార్చుకో… ప్రభుత్వ విప్ బాల్క సుమన్

వైయస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పద్ధతి మార్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సూచించారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వైయస్ఆర్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకి అన్నారు. షర్మిల ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. నర్సంపేట ఎమ్మెల్యేకు మగతనం లేదా అని షర్మిల మాట్లాడటం సిగ్గుచేటని, నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతూ.. ఆడబిడ్డ అంటూ కోడలు అంటూ.. డ్రామాలు చేస్తున్నదన్నారు.

షర్మిల తోలుబొమ్మలాడిస్తుంది.. ఎవరో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు ఎవరు ఇట్లాంటి పదజాలం ఉపయోగించరన్నారు. ఇలాంటి పిచ్చి మాటలు మరోసారి మాట్లాడితే జరిగే పరిణామాలకు తమకు సంబంధం ఉండదన్నారు. బ్రదర్ అనిల్ బయ్యారం ఉప్పుగనులను దోచుకున్నారని ఆరోపించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement