Thursday, March 28, 2024

బహిరంగ సభాస్థలి మార్పు.. సఖి సెంటర్ సమీపంలో సభ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యే బహిరంగ సభాస్థలి మార్పు చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, దాసరి మనోహర్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులు సఖి సెంటర్ సమీపంలో గల స్థలంలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా అనుకున్న విధంగా మంథని ఫ్లైఓవర్ కింద గల స్థలంలో నీరు నిల్వ ఉండడంతో బహిరంగ సభా స్థలాన్ని మార్చాలని నిర్ణయించిన అధికారులు సఖి సెంటర్ సమీపంలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించి సభకు అనువుగా ఉంటుందని నిర్ణయించారు. దీంతో సభ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాస్తు సలహాదారు సుద్దాల తేజ, చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి, డీసీపీ రూపేష్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్, చీఫ్ ఇంజనీర్ ఏసీపీలు సారంగపాణి, మోహన్, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ లతోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement