Thursday, April 25, 2024

కులం, మతం ప్రతిపక్షాల ఎజెండా.. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ ఎజెండా: బాల్క సుమ‌న్‌

తెలంగాణలో ప్రతిపక్షాలు కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నాయని కేవలం సీఎం కేసీఆర్ ఒక్కరే రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా పని చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తన ట్విట్టర్ లో ఫోటో షేర్ చేశారు.. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కులం పేరుతో రాజకీయాలు చేస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్క‌ సీఎం కేసీఆర్ మాత్రమే బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నార‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement