Wednesday, April 24, 2024

ఘనంగా ఐడీసీ చైర్మన్‌ జన్మదిన వేడుకలు..

కాల్వశ్రీరాంపూర్‌: ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి జన్మదిన వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈద జనసేన జిల్లా అధ్యక్షుడు కూస సతీష్‌ ఆధ్వర్యంలో మండలంలోని ఊశన్నపల్లి గ్రామ శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆవుల తిరుపతి, సింగిల్విండో డైరెక్టర్లు ముస్కు తిరుపతి, ముసుకు శ్రీనివాస్‌, నాయకులు మంద తిరుపతి, కూస సురేష్‌, ముస్కు తిరుపతి, విట్టం సంపత్‌, మేడిద సంజీవరెడ్డి, గొడుగు సతీష్‌, డాక్టర్‌ శీను, అనుముల మల్లయ్య, ముదురు కోళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement