Wednesday, March 27, 2024

అయ్యప్ప స్వామి దీవెనలు ప్రజలపై ఉండాలి : పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్ : అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవిత్ర మాసంలో అయ్యప్ప మాల ద్వారా చేపట్టి నిష్ఠ నియమాలతో 101 రోజులు 41 రోజులు మాల ధరించి స్వామివారిని లోక కళ్యాణార్థం భక్తులు వేడుకుంటారని, స్వామివారి దీవెనలు ప్రజలపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని అన్నారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అనంతరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు తోపాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement