Thursday, April 18, 2024

కన్నుల పండువగా అయ్యప్ప మెట్ల పూజ

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నివాసంలో హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మెట్ల పూజను కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల దంపతులు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అయ్యప్ప మాలధారులు, భక్తుల భజనల మధ్య స్వామి నామస్మరణతో మారుమోగింది. మెట్ల పూజ అనంతరం మాల ధారులకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో అయ్యప్ప మాలధారులు, బీజేపీ నాయకులతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement