Friday, April 26, 2024

సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.. డిసిపి రూపేష్

సైబర్ నేరాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పెద్దపల్లి డిసిపి రూపేష్ పిలుపునిచ్చారు. ఈరోజు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్ లో సైబర్ అంబాసిడర్లతో నిర్వహించిన గ్రాండ్ ఫినాలే సమావేశంలో 11 నెలలుగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నుండి ఇద్దరికీ సైబర్ నేరాలపై పూర్తి స్థాయిలో శిక్షణ కల్పించామన్నారు. అంబాసిడర్లు విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులకు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి మాధవి, పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, సతీష్, లక్ష్మీనారాయణ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement