Friday, March 29, 2024

అసత్య ప్రచారాలు మానుకోండి, వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీకి: పుట్ట మధు

తనను రాజ‌కీయంగా దెబ్బతీసేందుకు తాను బీజేపీలో చేరెందుకు ఢిల్లీ వెళ్లారంటూ చేస్తున్న అసత్యపు ప్రచారాలు మానుకోవాలని పెద్దపల్లి చైర్మన్ పుట్ట మధు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరేది లేదని, వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీకి వచ్చినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తనకు గతంలో మంథని ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ గా కొనసాగే అవకాశం కల్పించారన్నారు.

- Advertisement -

టీఆర్ఎస్ పార్టీలో తనకు నష్టం కలిగించే విధంగా ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఏదో ఒక పోస్ట్ తనపై పెడితే దాని నమ్మి ప్రజల్లోకి క్రెడిబిలిటీ ఉన్న న్యూస్ చానల్ స్క్రోలింగ్లు ప్లే చేయడం విచారకరమన్నారు. గతంలో మంథనిలో అంబేద్కర్ సాక్షిగా ఇలాంటి తీరుపై మీడియాను తాను ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. బడుగు బలహీనుల వర్గాల నుంచి, అత్యంత కిందిస్థాయి నుంచి రాజకీయ ప్రస్తానని ప్రారంభించిన తనపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement