ఓదెల: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. ఓదెల తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ సమేశ్వర్ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఓదెలలో మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్తోపాటు పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. గుంపులలో జరిగిన వేడుకల్లో టీ ఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ గట్టు- మహేష్గౌడ్, మాజీ ఉప సర్పంచ్ రాజుల కిషన్, యూత్ అధ్యక్షుడు బొమ్మక నరేష్, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల రమేష్, తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్, కోడి విజయ్, కృష్ణలు పాల్గొన్నారు. అలాగే పొత్కపల్లిలో బీజేపీ మండల అధ్యక్షులు శనిగరపు రమేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పుల్లూరి పృథ్విరాజ్, గొడుగు భిక్షపతి, బండారి వినోద్, మేకల నిఖిల్, శనిగరపు అక్షయ్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement