Wednesday, April 24, 2024

అంబేద్కర్‌ అందరివారు..

పెద్దపల్లిరూరల్‌: మండలంలోని పలు గ్రామాలతోపాటు పెద్దపల్లి పట్టణంలో అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, వివిధ ప్రజా సంఘాల, పలు పార్టీల నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్‌, ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ అంబేద్కర్‌ ఒక కులానికో, మతానికో పరిమితం కాదని, అన్ని వర్గాల కోసం రాజ్యాంగం రూపొందించి అందరివాడుగా నిలిచారన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించి హక్కులను కాపాడుకున్నపుడే ఆయనకు నిజమైన నివాళి ఇచ్చినట్లవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, కుమార్‌ దీపక్‌, అంబేద్కర్‌ సంఘం ఉపాధ్యక్షుడు మామిడిపల్లి బాపయ్య, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని అప్పన్నపేట గ్రామంలో అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సర్పంచ్‌ చీకటి స్వరూప పోచాలు, పంచాయతీ సిబ్బంది ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement