Monday, April 15, 2024

కార్మికులందరూ క్షేమం.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..

సింగరేణి ఫిల్టర్ బెడ్ లో చిక్కుకున్న కార్మికులు క్షేమంగా తిరిగి వచ్చారు. గురువారం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ ఆపరేషన్ చేసి ఐదుగురు కార్మికులతో పాటు జాలర్లను స్పీడ్ బోట్లలో ఒడ్డుకు చేర్చారు. ఫిల్టర్ బెడ్ వద్ద సింగరేణి కార్మికులు కనకం లక్ష్మయ్య, దొడ్డపల్లి సమ్మయ్య, సంఘం రాజమౌళి, సాయిలు, కుమార్ లు చిక్కుకోగా వారిని కాపాడేందుకు వెళ్లిన జాలర్లు సైతం అక్కడే చిక్కుకున్న విషయం విధితమే. గురువారం సింగరేణి అధికారులకుతో పాటు రామగుండం శాసనసభ్యులు కోరకంటి చందర్ సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. కార్మికులు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement