Tuesday, March 26, 2024

అక్రమ అరెస్టుల ఖండన..

ఎల్లారెడ్డిపేట : మండలంలోని గుండారం గ్రామంలో పేద ప్రజలకు భూమిని పంపిణీ చేసే విషయంలో రాజు నాయక్‌ అక్రమ అరెస్ట్‌ను మండల కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తీవ్రంగా ఖండించారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసులలో ఇరికించి అన్యాయంగా జైలుకు పంపడం సిగ్గుచేటన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టినట్లయితే వారిని కూడా హైకోర్టుకు తెప్పించడం ఖాయమన్నారు. గుండారంలో రాజేందర్‌పై పెట్టిన రౌడీషీట్‌ కేసును హైకోర్టు కొట్టివేసిందన్నారు. అలాగే రాజు నాయక్‌ కేసు కూడా హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ పిటిషన్‌ వేస్తామన్నారు. మండల కేంద్రంలో ఇటీ-వల కేటీ-ఆర్‌ పర్యటన ఉంటే అక్రమంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి నిర్బంధించారని, కేసులకు భయపడేది లేదని, జైలుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులను కూడా వదిలిపెట్టేది లేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు దండు శీను, జిల్లా కార్యదర్శి పందిళ్ళ లింగంగౌడ్‌, అధ్యక్షులు ఎస్సి సెల్‌ అధ్యక్షులు కరిగే శ్రీనివాస్‌, చిన్ని బాబు, బానోతు రాజు నాయక్‌, ఎంపిటిసి, కొత్త పల్లి పద్మ దేవయ్య, భూక్య శీను రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement