Monday, April 15, 2024

సీఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు .. మంత్రి గంగుల

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ స్థలిని ఈరోజు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని, తెరాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారన్నారు. అనంతరం లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ముఖ్యమంత్రి సభ కోసం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, ఎమ్మెల్యే లు దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవి శంకర్, రాకేష్, బాలమల్లు, గ్రంథాలయ చైర్మన్‌ లు రఘువీర్‌సింగ్‌, రవీందర్ రెడ్డి, హరి శంకర్, సూరి లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement