Tuesday, April 23, 2024

రైలు ఢీకొని పులి మృతి..

రైలు ఢీకొని పులి మృతి చెందిన సంఘటన తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన మాణిగర్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి శుక్రవారం సిర్పూర్‌ టౌన్‌, మానిగర్‌ మధ్యలో రైలు ఢీకొని మృతిచెందినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌ పక్కన నుజ్జు నుజ్జయిన పులి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పులి మృతి చెందిన విషయాన్ని రైల్వే అధికారులు ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement