Tuesday, April 23, 2024

భారీ బహిరంగ సభకు .. లక్ష మంది జన సమీకరణ : మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈనెల 29న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఈరోజు సఖి సెంటర్ సమీపంలో గల బహిరంగ సభ స్థలిని జిల్లా కలెక్టర్ సంగీత, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రూపేష్, అడ్మిన్ డిసిపి అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఏసీపి సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్ తో పాటు తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement