Wednesday, April 17, 2024

ఫార్మా విద్యార్థినికి వ్యాపారవేత్త చేయూత

శాతవాహన విశ్వ విద్యాలయంలో బీ ఫార్మసీ చదివి హైదరాబాద్ లోని నైపర్ లో యం ఫార్మసీ లో ప్రవేశం సాధించిన విద్యార్థిని దాసరి రాజలక్ష్మి కి హైదరాబాద్ లోని ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ నంద కిషోర్ వ్యాస్ బిలాల్ ల్యాప్ టాప్ సహాయంగా అందజేశారు. విద్యార్థిని రాజలక్ష్మి శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో బీ ఫార్మసీ చదివి జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ పరీక్షలో అత్యున్నత ప్రతిభ కనబర్చి హైదరాబాద్ లోని నైపర్ లో ప్రవేశం సాధించింది. ఆర్థిక కారణాల వల్ల ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, కంప్యూటర్ కొనడానికి ఇబ్బందులు పడుతోంది.

ఈ విషయాన్ని కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై కిషోర్ ద్వారా తెలుసుకున్న హైదరాబాద్ లోని గోషామహల్ ఏసీపీ ఆర్ సతీష్ కుమార్, ప్రముఖ వ్యాపార వేత్త నంద కిషోర్ వ్యాస్ బిలాల్ ను సంప్రదించగా ఆయన ఒక నూతన ల్యాప్ టాప్ ను అందించడానికి ముందుకు వచ్చారు. శుక్రవారం రోజున శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్ మల్లేష్ ల్యాప్ టాప్ ను విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ దాతలను అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టాలని, పేద విద్యార్థులను ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థిని రాజలక్ష్మి, తనకు చేయూతనిచ్చి ప్రోత్సాహించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ తాను మరింత కష్టపడి చదివి తల్లిదండ్రులకు, చదివిన విద్యా సంస్థలకు మంచి పేరు తెస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement