Thursday, April 18, 2024

పెద్దపల్లి జిల్లాలో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

పెద్ద‌ప‌ల్లి జిల్లా ప‌రిధిలోని బ‌సంత్‌న‌గ‌ర్ రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద 56 ఏళ్ల వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వేగంగా వెళ్తున్న రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. పాల‌కుర్తి మండ‌లం ఈస‌ల‌త‌క్క‌ళ్ల‌ప‌ల్లికి చెందిన బాల‌సాని మ‌ల్లేశం త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆదివారం బుగ్గా రామ‌స్వామి ఆలయానికి వెళ్లాడు. ద‌ర్శ‌నం అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌ను తిరిగి ఇంటికి పంపాడు. త‌న‌కు కొంచెం ప‌ని ఉంది. ఆ ప‌ని పూర్తయిన త‌ర్వాత తిరిగి వ‌స్తాన‌ని మ‌ల్లేశం త‌న కుటుంబ స‌భ్యుల‌కు చెప్పాడు.

రాత్రి అయిన‌ప్ప‌టికీ మ‌ల్లేశం ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో.. కుటుంబ స‌భ్యులు బ‌సంత్‌న‌గ‌ర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌ల్లేశం సెల్‌ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా అత‌ని ఆచూకీని కనుగొన్నారు. సోమ‌వారం ఉద‌యం బ‌సంత్ న‌గ‌ర్ రైల్వేట్రాక్ వ‌ద్ద‌కు వెళ్లి మ‌ల్లేశం మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోదావ‌రిఖ‌ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement