Tuesday, April 23, 2024

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

ఇల్లంతకుంట: మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామానికి చెందిన రామంచ మల్లయ్య అనారోగ్యంతో బాధ పడుతుండగా చికిత్స కోసం సీఎం సహాయనిధి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 80వేల ఎల్‌ఓసీని సర్పంచ్‌ గొడిసెల జితేందర్‌ గౌడ్‌ అందజేశారు. శుక్రవారం మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఆదేశాల మేరకు మల్లయ్య కుటుంబ సభ్యులకు చెక్కును పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్‌ కుమార్‌, ఎంపీటీసీ స్వప్న కరుణాకర్‌రెడ్డి, వార్డుసభ్యులు శంకర్‌, నాయకులు జిల్లా మహేశ్‌, రామంచ బాబు, బైండ్ల మల్లేశం, బట్టు అనిల్‌కుమార్‌, మల్లయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement