Thursday, April 25, 2024

ఘనంగా మొల్ల జయంతి వేడుకలు

ఎల్లారెడ్డిపేట: మొదటి తెలుగు మహిళ కవయిత్రి మొల్లమాంబా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వయంగా చదువునేర్చుకొని కలం పట్టి కవిత్వం రాసి సాహిత్య చిరిత్రలో మహిళా లోకంలో చరిత్ర సృష్టించిన మహానీయురాలు మొదటి మహిళ కవయిత్రి మొల్ల మాంబా అని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షులు డా. వాసరవేణి పరశురాం అన్నారు. యువత ఆమెను స్పూర్తీగా తీసుకోవాలన్నారు. అనంతరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమేష్‌, పెరుమాండ్ల రాజయ్య, గజభీంకార్‌ అజయ్‌, రేపాక దత్తాద్రి, పూజిత, అఖిల, ఉమ్మిరెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement