Thursday, April 25, 2024

క‌ల్వ‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి బాట‌లు : స‌బితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నామ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని కడ్తాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, రైతువేదిక, బాలుర పాఠశాల‌ల్లో డిజిటల్ తరగతి గదులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement