Friday, April 19, 2024

పీజీ మెడికల్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఆహ్వానం

రాష్ట్రంలోని పీజీ వైద్య, విద్య కోర్సుల్లో కన్వీనర్ కోటాలో  ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ – పీజీ – 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా/ డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలన్నారు. కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి  ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు.

నిర్ధేశిత ధరఖాస్తును పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌ సైట్‌లో అప్‌ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్  www.knruhs.telangana.gov.in లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement