Tuesday, March 26, 2024

మంత్రి హత్యకు కుట్ర కేసులో.. నిందితుల బెయిల్‌ పిటీషన్‌పై తీర్పు రిజర్వ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్ర కేసులో నిందితుల బెయిల్‌ పిటీషన్‌పై సోమవారం విచారణ ముగిసింది. బెయిల్‌పై తీర్పును మేడ్చల్‌ కోర్టు రిజర్వ్‌ చేసింది. కేసు తదుపరి విచారణను మార్చి 31వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్‌ పిటీషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు నిందితులకు బెయిల్‌ మంజూరు చేయవద్దని కౌంటర్‌ దాఖలు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్‌ ఇవ్వొద్దని, నిందితులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టు దృష్టికి తెచ్చారు.
సోషల్‌ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేసే అవకాశముందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు.

మరోవైపు నిందితుల పోలీస్‌ కస్టడీ ఇప్పటికే ముగిసినందున వారికి బెయిల్‌ మంజూరు చేయాలని డిఫెన్స్‌ లాయర్‌ న్యాయమూర్తిని అభ్యర్థించారు. వారంతా విచారణకు అన్ని విధాలా స#హకరిస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు, సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను పరిశీలించినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవని పోలీసులు చెప్పారని, అయితే ఆ పరిసరాల్లో 30కి పైగా సీసీ కెమెరాలు ఉన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. పోలీసుల ఉద్దేశపూర్వకంగా కౌంటర్లు దాఖలు చేస్తున్నారని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేశారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement