Thursday, March 28, 2024

స‌భ్య‌త్వం తీసుకుని కాంగ్రెస్ కుటుంబంలో చేరండి : భూప‌తిరెడ్డి

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల ఉచిత భీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబంలో చేరాలని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు న‌ర్సారెడ్డి భూప‌తిరెడ్డి ఆకాంక్షించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గాగిల్లాపూర్ లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆయ‌న‌ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ… సోనియాగాంధీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వం తీసుకోవాల‌న్నారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సదానంద్, యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి, పరశురాం గౌడ్, ధర్మారెడ్డి, నయీం, లాలూ సత్తార్, మొహమ్మద్ పాషా, రాములు, చెవిటి బాలయ్య, అశోక్, రమేష్, చెవిటి శ్రీనివాస్, ఎల్లెష్, నాగరాజు, రాజు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement