Tuesday, April 23, 2024

డైరెక్ష‌న్ కెసిఆర్ ది.. యాక్ష‌న్ గ‌వ‌ర్న‌ర్ ది – జ‌గ్గారెడ్డి..

హైదరాబాద్: బిఆర్ఎస్,బిజెపిలు రెండు ఒక్క‌టే అనే విష‌యం గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీలో చేసిన ప్ర‌సంగంతో మ‌రోసారి తేలిపోయింద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అన్నారు.. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, బయట పులిలా గర్జించిన గవర్నర్ అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారంటూ వ్యాఖ్యానించారు..

గ‌వ‌ర్న‌ర్. అలా మాట్లాడకపోతే ఆమె మైక్ కూడా కట్ అవుతుందని పేర్కొన్నారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అన్నారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్డైరెక్షన్‌లో గవర్నర్ నడిచారని, ప్ర‌భుత్వం ఇచ్చిన ప్ర‌సంగ ప‌త్రాల‌లో ఉన్న విష‌యాన్ని య‌దాత‌ధంగా చదివార‌ని అన్నారు.. తప్పని సరి పరిస్థితుల్లో సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై మధ్య రాజీ కుదిరిందని దీంతో గ‌వ‌ర్న‌ర్ కూడా చివరకు తుస్సు మనిపించారన్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంలో ప్ర‌భుత్వ బాకా త‌ప్ప నిజాలు లేవంటూ మండి ప‌డ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement