Thursday, March 28, 2024

జగద్గిరిగుట్ట అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని ఆర్యవైశ్య సంఘం భవనం వద్ద అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజ మహోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వామి వారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామి వారి చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రకాష్ గుప్త, తెరాల శ్రీనివాస్ గుప్త, రామ్ చందర్ గుప్త, స్థానిక డివిజన్ అధ్యక్షుడు రుద్రఅశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, వేణు యాదవ్, ఎత్తరి మారయ్య, ఇందిరా గౌడ్, బాబుగౌడ్, ప్రవీణ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement