Friday, April 19, 2024

ఐ సెట్ ఫస్ట్ పేజ్ కౌన్సెలింగ్ పూర్తి.. ఇంకా 13,658 సీట్లు

హైదరాబాద్‌, ప్ర‌బ‌న్యూస్: ఫస్ట్‌ పేజ్‌ కౌన్సెలింగ్‌ తర్వాత ఐసెట్‌ సీట్లు (ఎంబీఏ, ఎంసీఏ) 13,658 మిగిలాయి. మొత్తం సీట్లల్లో మొదటివిడత కౌన్సెలింగ్‌లో 19,209 సీట్లను అభ్యర్థులకు కేటాయించగా, అందులో 13,592 సీట్లకు మాత్రమే అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేశారు. 5617 మంది అభ్యర్థులు రిపోర్ట్‌ చేయకపోగా మొత్తం 13,658 సీట్లు మిగిలాయి. అయితే వీటిని ఫైనల్‌ ఫేజ్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రక్రియ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈనెల 21 వరకు 2801 మంది ప్రాసెసింగ్‌ ఫీజు కట్టి స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఈనెల 22 వరకు వీరికి ధృవపత్రాల పరిశీలన చేయనున్నారు. వెబ్‌ ఆప్షన్లకు గడువు 23 వరకు ఇచ్చారు. ఈనెల 26న సీట్లను కేటాయించనున్నారు.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement