Thursday, April 25, 2024

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్‌

ఇంట‌లిజెన్స్ వ‌ర్గాలు అందించిన స‌మాచారం మేర‌కు హైద‌రాబాద్‌లో అంతరాష్ట్ర‌ గంజాయి ముఠా ను రాచ‌కొండ ఎస్‌వొటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల నుంచి 1240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.08 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారి నుంచి మూడు కార్లను సీజ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement