Friday, April 19, 2024

టీమిండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ లో గెల్లు శ్రీనివాస్ కు మద్దతు..

లండన్ వేదికగా జరుగుతున్న టీమిండియా-ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవుకు మద్దతు లభించింది. భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ క్రికెట్ మైదానం ఓవల్‌లో ఎన్నారై టీఆర్ఎస్ నాయకుడు అబు జఫర్.. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు మద్దతుగా ప్ల‌కార్డు ప్ర‌ద‌ర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి ఎంతో క్రియాశీలకంగా పని చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న అబు జాఫర్‌ని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అభినందించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పరువు తీసేది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement