Thursday, April 18, 2024

తెలంగాణలో మందుబాబులు ఖుష్ – ధరలు తగ్గించిన ప్రభుత్వం

హైదరాబాద్ – మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గించినట్లు సర్కారు వెల్లడించింది.మద్యంపై ప్రభుత్వం విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీర్ మినహా లిక్కర్‌కు చెందిన అన్ని బ్రాండ్లపై ధరలు తగ్గాయి. ఫుల్‌ బాటిల్‌పై రూ.40, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 చొప్పున ధరలు తగ్గాయి. కొన్ని రకాల బ్రాండ్స్ ఫుల్ బాటిల్స్‌పై రూ.60 వరకు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచే అమలులోకి వచ్చాయని తెలిపారు. అధిక ధరల కారణంగా బయటి రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి లిక్కర్ అక్రమంగా వస్తున్నట్లు అధికారులు తేల్చారు. అక్రమ మద్యం రవాణాను నియంత్రించేందుకే ప్రభుత్వం ధరలు తగ్గించినట్లు ఆబ్కారీ అధికారులు వివరించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement