Tuesday, April 23, 2024

ములుగులో పర్యటించిన ఐఏఎస్ అధికారులు

ములుగు జిల్లా ఐఏఎస్‌ అధికారుల బృందం పర్యటించింది. జిల్లాలోని మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, వెంకటాపూర్ ములుగు మండలాల్లో ఐఏఎస్‌ అధికారుల బృందం స్మితా సబర్వాల్, క్రిస్టినా చోంగ్థు, వాకాటి కరుణ, దివ్య, ప్రియాంక వర్గీస్‌ పర్యటించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ముచ్చటించి మెనూ ప్రకారం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించారు. అలాగే గర్భిణులు రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు చేయించుకునేలా చూడాలని, పౌష్టికాహారం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని సిబ్బందికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement