Thursday, April 25, 2024

ఫోన్ మాట్లాడుతూ జారిపడి యువకుడు మృతి

హైదరాబాద్: మణికొండ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు. మణికొండకు చెందిన సుజిత్‌ (32) శనివారం ఉదయం భవనం రెండో అంతస్తులో ఫోన్‌లో వీడియో కాల్‌ మాట్లాడుతూ జారిపడ్డాడు. అతడికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వెంటనే సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం సుజిత్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో కొత్తగా 727 కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement