Friday, April 26, 2024

మోజ్ గ‌ల్లీ క్రికెట్ తో క్రికెట్ ఫీవ‌ర్ మొద‌లుపెట్టిన య‌జ్వేంద్ర చాహ‌ల్

ప్ర‌స్తుత ఐపీఎల్ సీజ‌న్ లో క్రికెట్ ఫీవ‌ర్ ను ఆస్వాదించేందుకు భార‌త‌దేశ‌పు నంబ‌ర్ వ‌న్ షార్ట్ వీడియో యాప్ అయిన మోజ్ తాజాగా క్రికెట్ అభిమానుల కోసం మోజ్ గల్లీ క్రికెట్ ను ప‌రిచయం చేస్తోంది. ప్ర‌ముఖ లెగ్ స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర చాహ‌ల్ మోజ్ గ‌ల్లీ క్రికెట్ లో చేరాడు. మార్చి 26న ప్రారంభ‌మై 9 వారాల పాటు సాగ‌నున్న‌ ఈ క్యాంపెయిన్ లో వినూత్న‌మైన క్రికెట్ ఫిల్ట‌ర్లు, 10ల‌క్ష‌ల విలువైన బ‌హుమ‌తులు ఇచ్చే ఉత్తేజ‌క‌రమైన పోటీలు, చాహ‌ల్ ఆటోగ్రాఫ్ చేసిన ఎక్స్ క్లూజివ్ క్రికెట్ మ‌ర్కండైజ్ ఉన్నాయి. రోజూ ఒక క్రియేట‌ర్ అత్యంత వైర‌ల్ కంటెంట్ ను సృష్టిస్తే ఐపీఎల్ గెలుచుకుంటాడు. ఈసంద‌ర్భంగా య‌జ్వేంద్ర చాహ‌ల్ మాట్లాడుతూ.. గ‌ల్లీ క్రికెట్ భార‌తీయుల‌ను ఏక‌తాటిపైకి తెస్తుంద‌ని మ‌నంద‌రికీ తెలుస‌న్నారు. ఈ క్రీడ ప‌ట్ల త‌న అభిరుచి వ‌ర్ణ‌నాతీతమ‌న్నారు. ఈ ప్ర‌చారంలో భాగం కావ‌డం త‌న‌కు చాలా సంతోషంగా ఉంద‌న్నారు. మోజ్ క్రియేట‌ర్ల నుంచి మంచి ఉత్తేజ‌క‌ర‌మైన కంటెంట్ ఎప్పుడొస్తుందా అని తామంతా చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement