Wednesday, March 27, 2024

హైద‌రాబాద్ కు య‌శ్వంత్ సిన్హా..

విప‌క్షాల అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు. త‌న ప్ర‌చారాన్ని కేర‌ళ నుంచి ఈరోజు ఆయ‌న ప్రారంభించారు. ఎల్డీఎఫ్‌, యూడీఎఫ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ఆయ‌న విడివిడిగా స‌మావేశ‌మ‌య్యారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఓటేయ్యాల‌ని వారిని సిన్హా కోరారు. రేపు త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించ‌నున్నారు. జులై 1న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో, 2న తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో విడివిడిగా యశ్వంత్ సిన్హా స‌మావేశం కానున్నారు. అయితే
య‌శ్వంత్ నామినేష‌న్ దాఖ‌లు చేసిన కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ‌కు రావాల‌ని ఆ రోజే సిన్హాను కేటీఆర్ కోరారు. ఈ నేప‌థ్యంలో జులై 2న ఆయ‌న తెలంగాణ‌కు రానున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో య‌శ్వంత్ సిన్హా స‌మావేశం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement