Tuesday, April 23, 2024

చిక్క‌డ‌ప‌ల్లిలో మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి చిక్కడపల్లిలోని మహిళ భవన్ వద్ద జి.హెచ్.ఎం.సి ముషీరాబాద్ సర్కిల్ యు సి డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శాలువాతో సత్కరించి కేక్ కట్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ… దేశ నిర్మాణంలో మహిళల పాత్ర చాలా గొప్పదని, అనేక రంగాల్లో మహిళలు తిరుగులేని నాయకత్వాన్ని పోషిస్తున్నారని కొనియాడారు. అలాగే ప్రతి ఒక్కరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ముషీరాబాద్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిరుపతి యాదయ్య, డీపీఓ సుధాకర్, సూపరిండెంట్ నరసయ్య, ఏఎంఓ హెచ్ డాక్టర్ మైత్రి, యూసీడీ అధికారులు మధు, మొహమ్మద్ ఉస్మాన్, మంజుల, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement