Thursday, April 25, 2024

డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో మోసం…మాయ‌గాడికి చెప్పుతో దేహ‌శుద్ది చేసిన మ‌హిళ‌….

హైద‌రాబాద్ – డ‌బుల్ రూం ఇళ్ల పేరుతో మోసం చేసిన మాయ‌గాడికి ఓ మ‌హిళ చెప్పుతో దేహ‌శుద్ది చేసి బుద్ది చెప్పింది. న‌గ‌ర శివార్ల‌లోని బాలాన‌గ‌ర్ గౌత‌మీ న‌గ‌ర్ లో ఉండే అహ్మాద్ ఈ ప్రాంతంలోని పేద ప్ర‌జ‌ల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయింప‌జేస్తాన‌ని పలువురు ద‌గ్గ‌ర భారీగా న‌గదు వ‌సూలు చేశాడు.. అయితే ఎంత‌కీ ఇల్లు రాక‌పోవ‌డంతో బాధిత మ‌హిళ నిల‌దీసింది.. దీంతో అడ్డం తిరిగిన అహ్మ‌ద్ ఆమె ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తాన‌ని బెదిరించాడు.. ఆ మ‌హిళ అత‌డి మాట‌ల‌కు భ‌య‌ప‌డ‌కుండా బ‌హిరంగంగా చెప్పుతో దాడి చేసి అత‌డిని చిత‌క‌బాదింది..బాధిత మ‌హిళ‌తో పాటు అత‌డి వ‌ల్ల మోస‌పోయిన వారు అహ్మ‌ద్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement