కుత్భుల్లాపూర్ క్రైమ్ (ప్రభ న్యూస్): హైదరాబాద్లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవ్వాల జరిగింది. ఎల్లమ్మ బండ దత్తాత్రేయ కాలనీలో శిరీష (35) ఎనిమిది నెలల నుండి ఒంటరిగా ఉంటోంది. రెండు రోజుల నుండి తను ఉంటున్న రూమ్ నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో జగద్గిరిగుట్ట పోలీస్ లు సంఘటనా స్థలానికి వచ్చి తలుపు తెరిచి చూడగా శిరీష చనిపోయి ఉంది. అయితే.. ప్రసాద్ అనే వ్యక్తి తరచుగా వాళ్లింటికి వస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సైదులు తెలిపారు. ఇది హత్యానా, లేక ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement