Friday, April 19, 2024

బిసి నాయకుడిగా కెసిఆర్ సంక్షేమ ప‌థ‌కాల‌ను విమ‌ర్శించ‌డ‌మా – ఈట‌ల‌ను త‌ప్పు ప‌ట్టిన వినోద్

హైద‌రాబాద్ : ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను విమ‌ర్శిస్తూ ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ త‌ప్పుబ‌ట్టారు. తెలంగాణ భ‌వ‌న్‌లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ,. ప్ర‌భుత్వ ప‌థ‌కాలైన రైతుబంధు, ఆస‌రా పెన్ష‌న్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ వంటి ప‌థ‌కాల‌ను బ‌డుగు బల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ఆలోచించే నాయ‌కుడు ఆ ప‌థ‌కాల‌ను విమ‌ర్శించ‌డ‌ని ఈట‌ల రాజేంద్ర‌కు కౌంట‌ర్ ఇచ్చారు.. రాజేంద‌ర్ లాంటి బీసీ నాయ‌కుడు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. దేశానికే తెలంగాణ ప‌థ‌కాలు ఆద‌ర్శంగా నిలుస్తాయ‌న్నారు. రైతుబంధు ప‌థ‌కాన్ని హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించార‌ని గుర్తు చేశారు. అంత గొప్ప ప‌థ‌కాన్ని రాజేంద‌ర్ విమ‌ర్శించ‌డం బాధేసింద‌న్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌ను అసెంబ్లీ ఫ్లోర్ లీడ‌ర్‌గా కేసీఆర్ నియ‌మించారని,. ఉద్య‌మంలోనూ స‌ముచిత‌మైన స్థానం క‌ల్పించార‌ని గుర్తు చేశారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement