Thursday, March 28, 2024

క‌రోనా వేళ ష‌ర్మిల రోడ్ షోల‌కు, స‌భ‌కు అనుమ‌తా – డిజిపిపై విహెచ్ ఫైర్..

హైదరాబాద్ : క‌రోనా సెకండ్ వేవ్ తో ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్న స‌మ‌యంలో వైఎస్ ష‌ర్మిల ఖ‌మ్మంలో త‌ల‌పెట్టిన సంక‌ల్ప స‌భ‌కు ఎలా అన‌మ‌తించారంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత విహెచ్ తెలంగాణ డిజిపి మ‌హేంద‌ర్ రెడ్డిని ప్ర‌శ్నించారు.. హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ‘అసలు రోడ్ల మీద రోడ్ షోలకు ఎందుకు అనుమతిచ్చారు..?. ఈ ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పాలి. మేము ఎక్కడికి వెళ్లినా అనుమతివ్వరు. వాళ్లకోక న్యాయం.. మాకొక న్యాయమా?. ఈ విషయంపై మా నేతలు కూడా మాట్లాడాలి. బీజేపీ, టీఆర్ ఎస్ , తెలంగాణలో ఉండే ఆంధ్రా ఓట్లను కొల్లగొట్టడానికి ఆడిస్తున్న నాటకమే ఇదంతా. షర్మిల ఏమైనా చేయాలనుకుంటే ఆంధ్రాలో చేస్కోవాలి. విజయమ్మ ఆంధ్రలో కొడుకు, తెలంగాణలో కూతురు ఉండాలని అనుకుంటున్నారా..?’ అంటూ నిల‌దీశారు… ఇక వైఎస్ షర్మిల కేవ‌లం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె మాత్రమేనని అంతకుమించి ఏమీలేదని తేల్చేశారు విహెచ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement