Friday, April 19, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో టి ఆర్ ఎస్ కు ఉర్దూ టీచ‌ర్స్ అసోసియేష‌న్, జెఎల్ అధ్యాప‌క సంఘం మ‌ద్దతు..

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ‌ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ (యూటీఏ-టీఎస్‌) మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, సురభీ వాణీదేవిల గెలుపునకు సహకరిస్తామని వెల్లడించింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితకు తమ మద్దతు లేఖను అందించారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం (జీజేఎల్‌ఏ), టీఎస్ సెర్ప్‌( ఐకేపీ) ఉద్యోగ సంఘాల జేఏసీ తో పాటు పలు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. రెండు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తామని తెలిపాయి. మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి సురభీ వాణీదేవి, నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement