Tuesday, April 23, 2024

పేద వ‌ధువు వివాహానికి పుస్తెమట్టెలు అందజేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద ఎస్సీ కుటుంబానికి చెందిన పెళ్లికూతురు వివాహానికి ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు పుస్తెమట్టెలు అందచేశారు. పురానాపుల్, జీయగూడ MCH కాలనీలో నివాసం ఉంటున్న ఎస్సీ కుటుంబంలో కూలీ పని చేసుకునే భారతమలపాకు పద్మ కూతురు గాయత్రి వివాహానికి నాగోల్ లోని తన కార్యాలయంలో పుస్తెమట్టెలు, చీర, గాజులు వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అందచేశారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా MRO కార్యాలయంలో సంప్రదించి 1,00,116 రూపాయలను తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో TRS పార్టీ మాజీ హైదరాబాద్ ఉపాధ్యక్షులు యాద శ్రీనివాస్ గుప్త, కేఎన్. బాలేశ్వర్ గుప్త, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement