Wednesday, March 27, 2024

బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని ఐవీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అండ్ తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణకు బాటలు వేస్తూ.. సంక్షేమంలో, అభివృద్ధిలో మన తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, దక్షిణ భారతదేశంలో మాజీ ప్రధాని, దివంగత నేత పి.వి నరసింహారావు తర్వాత అంతటి మహోన్నత వ్యక్తిత్వం విలువలు కలిగిన నేత సీఎం కేసీఆర్ కూడా ప్రధాని కావాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రైతులంతా పాడి పంటలతో విలసిల్లాలని, ప్రజలందరూ బాగుండాలని ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement