Thursday, April 25, 2024

శాంతి సేవా పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా

అంతర్జాతీయ శాంతి దినోత్సవ సందర్భంగా శాంతి సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజ‌ర‌య్యారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని చిత్రా లేఔట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఎస్.ఆర్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ పినాకిని యూత్ వెల్పేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవ సందర్భంగా సమాజహితం కోరుతూ.. ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ… విభిన్న రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులకు శాంతి సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, రంగారెడ్డి జిల్లా రిటైడ్ జడ్జి పెద్దిరెడ్డి కళ్యాణ్ రావు, మహేష్ చంద్ర, వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముస్కు అంజిరెడ్డి, ఎస్వీ రమేష్ బాబు, ఎస్.రామచంద్రరావు, కె. మురళీమోహన్ రాజ్, వై.చంద్రశేఖర్ రెడ్డి, యం.రమణాచారి, నల్లతీగ శ్రీనివాసాచార్యులు, ఖాదర్ గోరి, సత్యనారాయణ, వెంకటేష్, డా.లక్కరాజు నిర్మల, రమేష్ యెడెల్ల, వాసుదేవరావు, నర్సింహ్మ, వెంకటేశ్వరరావు, నర్సింహులు గౌడ్, సలీం, జనార్దన్ రెడ్డి, జగదీష్, స్వప్న, ఎ.వి. కృష్ణారెడ్డి, కాలనీ వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement